తిరుమల : ఈ నెల 26 నుంచి నిర్వహించే తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వొద్దని టీటీడీ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే గరుడ సేవ రోజు చెన్నై నుంచి గొడుగులు ఊరేగింపుగా వస్తాయని పేర్కొన్నారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని విజ్ఞప్తి చేశారు. ఆ కానుకలతో టీటీడీకి సంబంధం ఉండదని, అవి టీటీడీకి చేరవని వివరించారు. పలు హిందూ సంస్థలు గొడుగులు తిరుమలకు తీసుకురావడం ఆనవాయితీగా వస్తుందని వెల్లడించారు.