అమరావతి : ఎన్నికలు రాగానే ఆకర్షణీయ పథకాలతో ముందుకు వచ్చే టీడీపీ, జనసేనల మేనిఫెస్టోను ఏపీ ప్రజలు నమ్మొద్దని సీఎం జగన్ మోహన్రెడ్డి్ (CM Jagan) పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో ‘వైఎస్సార్ చేయూత’ నాలుగో విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు (Chandrababu) నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమేనని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని, బీసీలకు ఆయన చేసిన సేవలు గుండు సున్నాయేనని విమర్శించారు. 2014లో తన మేనిఫెస్టో (Manifesto) ను చెత్తబుట్టలో వేసిన ఘనుడని వ్యాఖ్యనించారు. పండంటి బిడ్డ అనే పథకం, పేద గర్భిణిలకు 10 వేలు ఇస్తామని, బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు,స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు.
మహిళా పారిశ్రామిక వేత్తలకు కుటీర లక్ష్మి అని వాగ్దానం చేసి మరిచిపోయారని దుయ్యబట్టారు. పొదుపుసంఘాల రుణాలు తీర్చకుండా ఎగ్గొట్టారని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు రాజకీయ సాధికారత కల్పిస్తూ, నామినేషన్ పోస్టులు, కాంట్రాక్టులు, 50 శాతం చట్టం చేసి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.