తిరుపతి జిల్లా : తిరుమల శ్రీవారికి విరాళంగా నిత్యం ఎన్నో రకాల వస్తువులు అందుతుంటాయి. భక్తులు తమకు తోచిన విధంగా వస్తు, ధన రూపంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి బహూకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమల వాసుడి చెంత పనిచేస్తున్న ఉద్యోగులు సైతం విరాళాలు అందించేందుకు ముందుకు వస్తుంటారు. ఎస్వీ ఆయుర్వే దవాఖాన నర్సు కూడా ఆ జాబితాలో చేరింది.
టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద దవాఖానకు 5 వీల్ఛైర్లు, ఒక స్ట్రెచర్ ట్రాలీని విరాళంగా అందించారు. ఇదే దవాఖానలో స్టాఫ్ నర్స్గా పని చేస్తున్న శ్రీమతి శిల్ప తన కుటుంబ సభ్యులు సంపత్కుమార్, గాయత్రి, విఘ్నేష్తో కలిసి ఈ మేరకు విరాళం అందించారు. వీటిని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పీ మురళీకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పలత, హెడ్ నర్సులు ఉమాశంకరీ, సరస్వతి పాల్గొన్నారు.
మరోవైపు హైదరాబాద్కు చెందిన గంజి రమేష్ దంపతులు రాగి గంగాళాలు విరాళంగా అందజేశారు. శ్రీవారి హుండీకి ఉపయోగించేందుకు వీలుగా ఉన్న 11 రాగి గంగాళాలను తిరుమల వైభవోత్సవ మండపంలో ఆలయ డిప్యూటీ రమేష్ బాబుకు అందించారు. ఈ రాగి గంగాళాల విలువ దాదాపు రూ.14 లక్షల వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.