తిరుమల : భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ విరాళం ఇవ్వవద్దని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు( Chairman BR Naidu ) విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ హిందు హెరిటేజ్ ఫౌండేషన్,షేవ్ టెంపుల్స్ డాట్ ఆర్గనైజేషన్ పేర్లతో (Global Hindu Heritage Foundation) (savetemples.org) పేర్లతో వ్యవహరిస్తున్న కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ మోసపూరిత చర్యలతో విరాళాలు సేకరించేందుకు భక్తులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
నవంబర్ 29న తిరుమల, తిరుపతి, తిరుచానూరు ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అనుమానాస్పద సంస్థలకు విరాళాలు ఇవ్వకుండా, వారి వలలో పడకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.