అమరావతి : టీడీపీ ఏపీ మహిళా నాయకురాలు, నటి దివ్యవాణి టీడీపీకి గుడ్ బై చెప్పారు. గత యేడాదిగా తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కన్నీళ్ల పర్యాంతమయ్యారు. విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను వెల్లడించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ప్రశంసిస్తూనే ఆయనను కొందరు నేతలు రాంగ్రూట్లోకి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మంచి చేస్తారనే టీడీపీలో చేరానని స్పష్టం చేశారు.
తనపై వస్తున్న అనుమానాల నివృత్తికి చివరి నిమిషం వరకు క్లారిటీ కోసం వేచి చూసాను. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని చెప్పారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు ఇప్పటికీ హైదరాబాద్ నుంచి వచ్చి వెళుతున్నారు. నేను కూడా హైదరాబాద్ నుంచే వస్తున్నానని అన్నారు. నేను ఎప్పుడు భజన చేయను. పార్టీలో నా స్థానం ఏంటో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రెస్మీట్లు పెట్టడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.
మీటింగ్లో ఎవరితో మాట్లాడించాల్లో ముందే నిర్ణయం తీసుకుంటారు. ఎవరూ చెప్పని నిజాలు నేను చెబుతున్నానని అందరూ ప్రశంసించారు. దివ్యవాణికి ప్యాకేజీ అందింది. అందుకే రాజీనామా చేయడం లేదని అంటున్నారని , బుద్దిలేని వాళ్లు బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ లైన్ ప్రకారమే వైసీపీపై విమర్శలు చేశానని ఆమె వెల్లడించారు.