అమరావతి : విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ కొట్టివేసింది. 2014 ఎన్నికలకు సంబంధించిన ఫలితాల వెల్లడికి ముందే అంచనాలను ప్రకటించడాన్ని అప్పటి ఎన్నికల సంఘం కమిషనర్ లగడపాటిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు సాక్షులను కోర్టు పలు దఫాలుగా విచారించిడంతో పాటు ఆడియో,వీడియో రికార్డింగ్లను న్యాయస్థానం పరిశీలించింది.
అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి 2019లో సర్వేల పేరిట హంగామా సృష్టించాడు .
తన సంస్థ చేపడుతున్న ఎన్నికల ఫలితాలు కచ్ఛితత్వంతో కూడుకున్నవని తెలిపారు. సర్వే ఫలితాలు పూర్తిగా భిన్నంగా రావడంతో ముందుగానే ఆయన ప్రకటించిన విధంగా రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు.