అమరావతి : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ( YS Sharmila) పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (MLA Kodali Nani) మండిపడ్డారు. పదవుల కోసమే జగన్పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులపై విమర్శలు చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడి పరిస్థితులు అనుకూలించక పోవడమే కాక పార్టీని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏపీ కాంగ్రెస్లో చేరారని ఆరోపించారు.
తెలంగాణలో పాదయాత్ర చేసిన షర్మిల, వైఎస్ ఆశయాలు సాధిస్తానని చెప్పి చేతులెత్తేసిందని అన్నారు. ఏపీలో పుట్టానని, వైఎస్ రాజశేఖర్రెడ్డి బిడ్డను అంటూ ఏపీలో కొత్త రాజకీయాలు మొదలు పెట్టారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కొత్త మేనిఫెస్టో (New manifesto) తో చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేస్తామని, దీంతో ఆయనకుప్రతిపక్ష హోదా కూడా రాదని వివరించారు. వైసీపీలో సీట్లురాని వారు, తొలగించిన వారే టీడీపీలో చేరుతున్నారని వెల్లడించారు.