తిరుమల : డయల్ యువర్ ఈవో కార్యక్రమం జూన్ 3 న తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎవి.ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని వివరించారు. ఇందుకు భక్తులు 0877-2263261 నంబర్కు ఫోన్ చేసి సమస్యలను వివరించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని వెల్లడించారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డు నడకమార్గంలో ఉన్న లక్ష్మీనరసింహాస్వామివారి ఆలయంలో ఇవాళ మండలాభిషేకం, సహస్ర కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇటీవల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ చేసిన విషయం విదితమే. సంప్రోక్షణ చేసి మండలం రోజులు పూర్తయిన సందర్భంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరిగింది.