అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (Cheif Justice ) గా జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణం (Sworn ) చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ గవర్నర్ ( Ap Governor) అబ్ధుల్ నజీర్ సీజేతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కొత్త సీజేకు గవర్నర్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్రెడ్డి , హైకోర్టు న్యాయమూర్తులు , మంత్రులు , ప్రతిపక్షనేత చంద్రబాబు, అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
2013 మార్చి 8న జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితులు కాగా 2022 జూన్ 10న ఠాకూర్ను ముంబై హైకోర్టుకు బదిలీ చేశారు. అక్కడి నుంచి ఆయనను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించారు. జమ్మూకశ్మీర్కు చెందిన జస్టిస్ ధీరజ్సింగ్ది న్యాయమూర్తుల కుటుంబం. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయమూర్తులుగా పనిచేశారు.
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ సోదరుడే జస్టిస్ ధీరజ్సింగ్. ఇటీవల కాలం వరకు బాంబే హైకోర్టులో నంబర్ టూ స్థానంలో కొనసాగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు.