తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల( Tirumala) కు వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకోగా 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.18 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.