అమరావతి : విజయవాడలో ఢిల్లీలో గురువారం తనిఖీలు నిర్వహించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే విద్యార్థులకు నకిలీ పత్రాలు ఇచ్చి.. యూఎస్ ఎంబసీ అధికారులను మోసం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. వీటి మూలాలు ఏపీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు విజయవాడలోని కన్సల్టెన్సీల్లో తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన ఒకరు ఈ నెల 7న దిల్లీలోని యూఎస్ ఎంబసీలో స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తాను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నానంటూ అపాయింట్మెంట్ లెటర్తో పాటు గుంటూరులోని ఓ బ్యాంకు నుంచి రూ.20లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరైందంటూ ఎంబసీకి దరఖాస్తు సమర్పించాడు.
అయితే, సదరు వ్యక్తి సమర్పించినవన్నీ తప్పుడు పత్రాలని ఎంబసీ అధికారులు గుర్తించారు. దీనిపై ఎంబసీ అధికారులు మరింత లోతుగా ప్రశ్నించడంతో నకిలీ పత్రాల గుట్టు బయటపడింది. వాటిని విజయవాడలోని స్ప్రింగ్ ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్కు చెందిన ఏజెంట్ కేశవ సమకూర్చినట్లు అతడు తెలిపాడు. ఈ పత్రాల కోసం రూ.26,500 చెల్లించినట్లు చెప్పాడు. దీనిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం మూడు రోజుల క్రితం విజయవాడకు వచ్చినట్లు తెలిసింది. ఇక్కడి కన్సల్టెంట్స్లో తనిఖీలు చేసినట్లు సమాచారం. కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.