తిరుపతి, : తిరుపతి కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా బుధవారం స్వామివారు హనుమంత వాహనం (Hanuman Vehical) పై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం (Tirumanjanam) వేడుకగా నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు గజ వాహనంపై రాములవారు దర్శనమిస్తారని వేద పండితులు వివరించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తులరద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 55,756 మంది భక్తులు దర్శించుకోగా 17,866 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.71 కోట్లు వచ్చిందన్నారు.