హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్ రావుకు మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. దగ్గుబాటికి తీవ్రమైన గుండెపోటు రావడంతో.. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. ప్రస్తుతం దగ్గుబాటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వర్ రావును ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మంగళవారం రాత్రి 7:40 గంటలకు అపోలో వెళ్లిన చంద్రబాబు.. దగ్గుబాటి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు దగ్గుబాటికి తోడల్లుడు అవుతారు.