అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ (Visakha Meteorological ) అధికారి డాక్టర్ సునంద్ వెల్లడించారు. రాగల 24 గంటల్లో తుఫాను (Cyclone) గా అనంతరం తీవ్ర తుఫానుగా మారే అవకాశముందని హెచ్చరించారు. తుఫానుకు ‘రేమాల్’ (Remal) గా నామకరణం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తుఫాను ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్(Bangladesh) తీరంలో 27 అర్దరాత్రి దాటాక తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఒడిస్సా, బంగాల్, బంగ్లాదేశ్పై తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పారు. మత్స్యకారులు (Fishernens) ఎవరూ కూడా మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.
తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై ఉండదని వివరించారు. అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించాయని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని ఆయన తెలిపారు.