తిరుమల : తిరుమలలో (Tirumala) శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 17 కంపార్టుమెంట్లలో (Compartments) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,179 మంది భక్తులు దర్శించుకోగా 25,602 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.03 కోట్లు వచ్చిందని వెల్లడించారు.