అమరావతి : నిషిద్ధ సీపీఎం మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు రాజేశ్వరి మంగళవారం నెల్లూరు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ విజయరావు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన రామోజు రాజేశ్వరిని గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన వ్యక్తిని వివరించారు. దళంలో పనిచేస్తూనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ కార్యకర్త నరేంద్రను వివాహం చేసుకున్నదని తెలిపారు.
ఇద్దరూ కలిసి పీపుల్స్వార్ గ్రూప్ కార్యకలాపాల్లో పాల్గొనేవారని ఎస్పీ పేర్కొన్నారు. దంపతులిద్దరూ మావోయిస్టుల రహస్య భేటీకి ఏర్పాట్లు చేసేవారని తెలిపారు. లొంగిన రాజేశ్వరి 10 కేసుల్లో నిందితురాలని చెప్పారు. ఆమె లొంగిపోతే ప్రభుత్వం రూ. 4లక్షల రివార్డు ప్రకటించిందని గుర్తు చేశారు.