అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటలో ముగ్గురు కొవిడ్తో మృతి చెందగా, కొత్తగా 230 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 2,615 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వారు తెలిపారు. 35,332 మంది నుంచి నమూనాలు పరీక్షించినట్లు, చిత్తూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు కొవిడ్తో మృతి చెందారని వివరించారు.
చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కొవిడ్ కేసులు అధికంగా నమోదయ్యినట్లు పేర్కొన్నారు.