అమరావతి : దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలకు కేంద్రం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఏపీ పంచాయతీరాజ్, సర్పంచుల సంఘం నాయకులు ఏపీ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు. రూ. 7,660 కోట్ల పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని , ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపించారు.
ప్రభుత్వం వాడుకున్న డబ్బులను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయించాలని వినతి పత్రం అందజేశారు. పంచాయతీల్లో నిధులు లేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సక్రమంగా పారిశుద్ధ్యం నిర్వహించలేకపోతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేసి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు.