తాడేపల్లి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సీఎంఓ అధికారులు జగన్ పర్యటనను ధ్రువీకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13 బుధవారం ఆయన విశాఖలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వాహనమిత్ర లబ్దిదారులతో సమావేశమై వారికి చెక్కులను పంపిణీ చేయనున్నారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ నెల 13 న ఉదయం 10 గంటలకు బయల్దేరనున్న సీఎం జగన్.. 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.05 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సమావేశమండపానికి వస్తారు. అక్కడ వాహనమిత్ర లబ్దిదారులతో ముఖామఖి సమావేశం ఫొటో సెషన్ ఉంటుంది.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడి బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. సమావేశంలో లబ్దిదారులకు చెక్కులు అందజేస్తారు. తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం 1.15 గంటలకు బయల్దేరి 1.25 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.