Chandrababu | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరిన్ని కష్టాలు పెరుగుతున్నాయి. సిల్క్ స్కామ్ కుంభకోణం వ్యవహారంలో ఆయన ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో మంగళవాం విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రెండు రోజుల్లో తీర్పును వెలువరించినట్లు తెలిపింది. క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ, బాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.
మరో వైపు చంద్రబాబుపై సీఐడీ మరో పీటీ వారెంట్ను దాఖలు చేసింది. ఫైబర్నెట్ కుంభకోణంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా పీటీ వారెంట్ దాఖలు చేయగా.. టెరాసాఫ్ట్ కంపెనీకి చంద్రబాబు ఫైబర్నెట్ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అభియోగాలు మోపింది. రూ.115కోట్ల నిధులు గోల్మాల్ అయ్యాయని దర్యాప్తు నివేదికలో సిట్ తేల్చిందని, 2019లో కుంభకోణంలో 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. నాటి ఎఫ్ఐఆర్లో ఏ-1గా వేమూరి హరిప్రసాద్, ఏ2గా మాజీ ఎండీ సాంబశివరావుగా పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఇన్నర్ రింగ్రోడ్ వ్యవహారంపై సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.