తిరుపతి: కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారికి టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం సందర్భంగా తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అందులోభాగంగానే తుమ్మలగుంట నుంచి తిరుచానూరుకు పాదయాత్రగా వచ్చిన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.