అమరావతి : రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్లో ముందుగా ఏపీ సీఎం వైఎస్ జగన్, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినిగించుకున్నారు.
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. కాగా ఏపీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 151 మంది వైఎస్సార్ సీపీకి చెందిన వారు కాగా 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఒకరు జనసేనకు చెందిన వారు ఉన్నారు.
రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలుండగా 22 మంది వైసీపీ, ముగ్గురు టీడీపీ సభ్యులున్నారు. రాజ్యసభ స్థానాలు 11 ఉండగా వైసీపీకి చెందిన ఎంపీలు 9 మంది, టీడీపీ, బీజేపీలకు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.