అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర, రాష్ట్ర నిధులను దోచేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు రాసిన మహాదోపిడీ పుస్తకాన్ని గురువారం సజ్జల ఆవిష్కరించి మాట్లాడారు.జన్మభూమి కమిటీలతో చంద్రబాబు(Chandara Babu) దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. అధికారం కోసం చంద్రబాబు, పవన్, బీజేపీని వాడుకుంటున్నారని విమర్శించారు.
దేశానికి అవినీతిని పరిచయం చేసిందే బాబు అని ఘాటుగా విమర్శించారు. రాజకీయం(Political) అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. షర్మిల మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ అధినేత మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పనున్నారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న ఆరోపణల వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని పేర్కొన్నారు.