Chandrababu Naidu | తెలుగు దేశం అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నిన్న అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రిని ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపరిచి.. రిమాండ్ రిపోర్టును దాఖలు చేసింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టు ఉదయం 8 గంటల నుంచి సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు.
ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు సీఐడీ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు చంద్రబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ను విధించింది. అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సీఐడీ సైతం కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత సీఐడీ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబు నాయుడును ఏసీబీ కోర్టు నుంచి తరలించారు. మరో వైపు సెంట్రల్ జైలు వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జైలు వద్ద భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు.