అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) ప్రతిపక్ష నాయకులపై విరుచుకు పడ్డారు. చిత్తూరు జిల్లాలో జరిగిన బహిరంగసభలో ఆయన టీడీపీ అధిచేత చంద్రబాబు(Chandra Babu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఒకరు వెన్నుపోటు వీరుడైతే మరొకరు ప్యాకేజీ సూరీడని ఆరోపించారు. ఇద్దరు నాన్ రెసిడెంట్ నాయకులేనని, వీరిని కలువాలంటే హైదరాబాద్కు పోవల్సిందేనని అన్నారు. ఇద్దరికి సామాజిక న్యాయం అసలుకే తెలియదని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు మేలు చేయడానికి కాదని, దోచుకోవడం, దాచుకోవడానికి మాత్రమే వస్తున్నారని ఆరోపించారు. కుప్పం నియోజకవర్గానికి 35 ఏండ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన చంద్రబాబుకు కుప్పంలో ఇళ్లు లేదని అన్నారు. ప్రజలను మోసం చేసేందుకు కుప్పంలో ఇళ్లు కట్టుకుంటున్నారని తెలిపారు. సొంత డెయిరీ మేలు కోసం చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు.