అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పేదలకు, రైతుల కోసం ఎలాంటి ప్రయోజనాలు అందిస్తామనే విషయం ప్రస్తావించలేదని, ఇది సామాన్యుడి పనికొచ్చే బడ్జెట్ కాదని విమర్శించారు. బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఆశాజనకంగా లేదని, అభిప్రాయపడ్డారు. బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదని ఆరోపించారు.
నదుల అనుసంధానంపై కేంద్ర ప్రణాళికలను ఆయన ప్రశంసించారు. డిజిటల్, సోలార్ రంగంలో సంస్కరణలను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనలో వైఎస్సార్సీపీ ఎంపీలు మరోసారి విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. 28 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం సాధించారని నిలదీశారు.