అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోసారి ఓటమి తప్పదని మంత్రి జోగి రమేశ్ జోష్యం చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పట్టని టీడీపీని తిరస్కరించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు . చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నుంచే బీసీల తిరుగుబాటు మొదలైందని పేర్నొ్న్నారు.
అభివృద్ధి చేపట్టని బాబును ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కల్పిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు తండ్రి, కొడుకును ప్రజలు నమ్మడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 175 నియోజకవర్గంలో ఓటమి తప్పదని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై అనాలోచితంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు.