అమరావతి : ఎన్డీయే కూటమిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు(Chandra Babu), జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్(Pawankalyan) చేరికపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) స్వాగతించారు. దేశాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల మేలు కోసం పనిచేస్తామని అన్నారు. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై శనివారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు.
రాబోయే పార్లమెంట్, రాజ్యసభ ఎన్నికల్లో మూడు పార్టీలు పరస్పర సహకారంతో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గత పదేళ్లుగా దేశ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. మోదీ బాటలోనే చంద్రబాబు, పవన్లు అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు తమకు పాత మిత్రుడని వాజ్పేయి , 2014లో నరేంద్ర మోదీ (Prime Minister Modi) ప్రభుత్వంలో కలిసి టీడీపీ విజయవంతంగా పనిచేసిందని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేశాయని పేర్కొన్నారు.