ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ ముందస్తుకు వెళ్లే యోచనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో వైసీపీ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. గడప గడపకు ప్రభుత్వం అన్న కార్యక్రమంలో నేతలకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందని, వ్యతిరేకత పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు.
టీడీపీ మహానాడు నిర్వహణ విషయంలో చంద్రబాబు నాయుడు మంగళవారం టీడీపీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన ముందస్తు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పథకాలు బూటకమన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందన్నారు. గడప గడపకూ ప్రభుత్వం అన్న కార్యక్రమంలో వైసీపీ నేతలను, మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారని, ఇక ఎంతో కాలం ప్రభుత్వం నడపలేమన్న నిర్ణయానికి జగన్ వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చూసే ఏపీ సీఎం జగన్ ముందస్తుకు ప్లాన్ చేసుకున్నారని చంద్రబాబు నేతలకు వివరించారు.