అమరావతి: గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమోన్మాది బాధితురాలు శ్రావణి కుటుంబాన్నిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.
ఈ ఘటనపై లోతైనవిచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని బాధితురాలి కుటుంబానికి వాసిరెడ్డి పద్మ హామీ ఇచ్చారు.
ప్రేమ, పెళ్లి పేరిట ఆడపిల్లలను వేధించే నీచమైన సంస్కృతిని ఖండించాలని ఆమె పేర్కొన్నారు. అమ్మాయిలు ఇలాంటి సమస్యలపై ప్రభుత్వ రక్షణ వ్యవస్థకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. దిశ యాప్ వినియోగం, అమలుపై విస్తృతంగా ఇంటింటికీ అవగాహన కల్పించాలని వాసిరెడ్డి పద్మ మహిళా పోలీసులకు సూచించారు.