అమరావతి : ఏపీలో సంచలనం కలిగించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడును పెంచుతోంది. ఈ కేసులో నిందితుడిగా శివ శంకర్రెడ్డికి నార్కో పరీక్షలు చేయించేందుకు సీబీఐ ఈరోజు (మంగళవారం) సీబీఐ పులివెందుల కోర్టులో బెయిల్ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ సందర్భంగా స్పందించిన కోర్టు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు సాయంత్రంలోగా కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిందితుడు శివశంకర్రెడ్డి ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.