అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం ( Markapuram ) జిల్లా రాయవరం పట్టణ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కలిగిరిలో హరికృష్ణ ట్రావెల్స్ నడుపుతున్న హరికృష్ణా రెడ్డి ( Harikrishna Reddy ) యజమానిగా ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
బుధవారం లారీ ట్రక్క్ను బస్సు ఢీ కొన్న ఘటనలో మొత్తం 14 మంది సజీవదహనం కాగా మరో 12 మంది వరకు గాయాలతో ఆసుపత్రుల పాలైన విషయం తెలిసిందే. బస్సు ఘటన జరుగగానే అక్కడి నుంచి పారిపోయిన డ్రైవర్ హరికృష్ణారెడ్డిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ మంత్రులు గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు.
బాధితులు పూర్తిగా కోలుకుని ఇళ్లకు చేరే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. రోడ్లు వెడల్పు చేయడంతో వాహనాలు వేగంగా వెళ్తున్నాయని, వాహనాల వేగాన్ని నియంత్రించాలని అభిప్రాయపడ్డారు.