అమరావతి : ఏపీలో అమరావతి రాజధాని కొనసాగించాలంటూ అమరావతి ఐక్యకార్యచరణ సమితి రైతులు నిరసనలను కొనసాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు చోట్ల నిరసనలు చేపట్టారు. మందడంలో భోగి మంటలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 19 గ్రామాల అమరావతి కార్పొరేషన్ ప్రతిపాదనపై నిరసన తెలియజేస్తూ .. కార్పొరేషన్ ప్రతిపాదన కాపీని భోగి మంటల్లో వేసి రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.
చంద్రగిరి మండలంలో నారావారి పల్లెలో టీడీపీ శ్రేణులు ప్రజావ్యతిరేక జీవోలను రద్దు చేయాలంటూ జీవో కాపీలను భోగి మంటల్లో వేశారు.