Srisailam | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఏపీలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో పెద్దిరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ప్రతిరోజూ రాత్రివేళల్లో స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత హోమాలు నిలుపుదల చేసినట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 13 నుంచి జనవరి 9 వరకు రూ.4,38,53,238 కోట్ల మేరకు ఆలయ హుండీ ఆదాయం సమకూరిందని తెలిపారు. నగదుతోపాటు 133.3 గ్రాముల బంగారం, 11 కిలోల 850 గ్రాముల వెండి కానుకలుగా వచ్చినట్టు పేర్కొన్నారు.