తిరుపతి : శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం శ్రీనివాసుడు శ్రీరాములు వారి అలంకారంలో హనుమంత వాహనంపై మాద వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు.
మధ్యాహ్నం శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సన్ని ఘనంగా నిర్వహించారు. వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
12 కంపార్టుమెంట్లలో భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న శ్రీవారిని 70,570 మంది భక్తులు దర్శించుకోగా 22,490 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.76 కోట్లు వచ్చిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 12 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని ఆలయ అధికారులు వివరించారు.