తిరుపతి : తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) భాగంగా శనివారం స్వామివారు హనుమంత వాహనం(Hanumanta vehicle)పై శ్రీరాముడు దర్శనమిచ్చారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో నిర్వహించిన వాహనసేవకు భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహిచారు. వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్ రమేశ్, కంకణబట్టర్ ఆనంద్ కుమార్ దీక్షితులు,భక్తులు పాల్గొన్నారు. కాగా శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలోని 12 కంపార్ట్మెంట్లు(compartments) నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం(sarvadarsan) 10గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు(ttd officials) వెల్లడించారు. నిన్న స్వామివారిని 63,507 మంది భక్తులు దర్శించుకోగా 29,205 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(hundi income) రూ. 3.72 కోట్లు వచ్చిందని వివరించారు.