అమరావతి : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (MLC by-election)లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల అధికారులు అధికారికంగా బొత్స ఎన్నికను ప్రకటించారు. ఆయన మూడేళ్లపాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. విశాఖ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ తీసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బీ ఫారం ఇచ్చి పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు , సహకరించిన వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పోటీ నుంచి కూటమి ప్రభుత్వం (Allaince Government) తప్పుకోవడంతో రంగంలో మొత్తం ఇద్దరే నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) , స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ (Nominations) నామినేషన్ వేశారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రాజీనామా చేసి జనసేనలో చేరడంతో అయితే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వైసీపీ అధిష్టానం అప్పటి మండలి చైర్మన్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వాటిని పలు దఫాలుగా పరిశీలించి చివరకు ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేశారు. దీంతో ఖాళీ అయిన విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి 600 మంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్ల సంఖ్యాబలం ఉంది. కూటమికి 200 పైగా మాత్రమే సభ్యులున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన కూటమి ప్రభుత్వం చివరకు హుందాగా రాజకీయాలు చేద్దామని, ఎవరిని ప్రలోభ పెట్ట వద్దని సూచిస్తూ ఎన్నికల్లో్ పోటీ వద్దంటూ చంద్రబాబు స్పష్టం చేయడంతో కూటమి బరిలో నిలువ లేదు.