అమరావతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు. తన రెండురోజుల పర్యటనలో భాగంగా గన్నవరం విమానశ్రయానికి చేరుకోగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. విజయవాడ, రాజమహేంద్రవరంలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం సిద్దార్ధ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో, ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుల సమావేశానికి హాజరుకానున్నారు. సాయంత్రం 5న్నర గంటలకు వెన్యూ వేదికగా వివిధ రంగాలకు చెందిన మేధావులతో నడ్డా సమావేశమై మోదీ ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలను వివరించనున్నారు.
రేపు (మంగళవారం )రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో గోదావరి గర్జన పేరిట నిర్వహిస్తోన్న బహిరంగసభకు నడ్డా ముఖ్యఅతిధిగా హాజరుకానున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పురేంధశ్వేరి, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు , ఎంపీలు లక్ష్మణ్, జీవీఎల్ తదితరులు పాల్గొన్నారు.