తిరుమల : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల దేవాలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట బీజేపీ కార్యకర్తలు, యువమోర్చ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని, ఓమిక్రాన్ ముప్పు పొంచి ఉంది కనుక, అందరికీ దీనిని ఎదర్కొనే శక్తిని ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.