అమరావతి : తిరుమలలోని ఎస్వీబీసీ ఛానల్పై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఛానల్లో సినిమా పాటల ప్రసారంపై ఆయన స్పందించారు. ఛానల్ నిర్వహణ బాధ్యతలు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడం ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. తిరుమలలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
టీటీడీ కి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అందరితో చర్చించాలని సూచించారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని పేర్కొన్నారు. ధర్మ ప్రచార కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయనిచ ధర్మప్రచార నిధులు ఎస్వీబీసీ ఛానల్కు కేటాయిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వేద పాఠశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.