అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ (YCP) లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (MP Vemireddy) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బుధవారం రాజీనామా(Resign) చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. రాజీనామాను తక్షణమే ఆమోదించాలని సీఎంను వేమిరెడ్డి కోరారు.
వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు. ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎం.డి.ఖలీలును నియమించిన విషయమై కనీస సమాచారం ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.