హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగా ణ): విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. జై దుర్గా జైజై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. మంగళవారం రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గాదేవీ అమ్మవారు దర్శనమిచ్చారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు.
ఇరుముడి శిరస్సున ధరించి అమ్మవారిని దర్శించుకున్నాక భవానీలు దీక్షను విరమించుకొన్నారు. మాల విరమణ కోసం వచ్చే భవానీలకు మల్లికార్జున మండపం దగ్గర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.