Kadapa MP Avinash | వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ జారీ చేసిన నోటీసులపై కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి స్పందించారు. ఈ కేసు దర్యాప్తులో పూర్తి స్థాయిలో సీబీఐకి సహకరిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సీబీఐకి లేఖ రాశారు.
కేవలం ఒకరోజు ముందుగా తనకు నోటీసు జారీ చేశారని సీబీఐకి రాసిన లేఖలో అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నదని తెలిపారు. కనుక మంగళవారం విచారణకు హాజరు కాలేనని వెల్లడించారు.