అమరావతి : కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) దాఖలు చేసిన ముందస్తు బెయిల్(Bail Petition )పై వాదనలు వినడానికి హైకోర్టు(High Court) నిరాకరించింది. వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Viveka)హత్య కేసులో సీబీఐ(CBI) విచారణను ముమ్మరం చేస్తుండడంతో ఏ క్షణమైనా తనను అరెస్టు చేయవచ్చన్న అనుమానంతో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు.
సుప్రీం కోర్టు(Supreme Court)లోనూ ఈ విషయంలో అవినాష్రెడ్డికి చుక్కెదురు కావడంతో మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు బెయిల్ పిటిషన్పై విచారణకు రాగా ఇరుపక్షాల తరుఫున హాజరైన న్యాయవాదులు వాదనలు కొనసాగించాలని కోరారు. దీనికి కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు అసహనం వ్యక్తం చేసింది.
ఇప్పటికిప్పుడు ఒక్కరోజులో వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం వీలుకాదని హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో తమపై ఒత్తిడి చేయవద్దని ఆయన అన్నారు. మే 1 నుంచి జూన్ 5 వ తేదీవరకు వేసవి సెలవులున్న దృష్ట్యా అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జూన్ 5కు వాయిదా వేశారు.