కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఆటో ట్రాలీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గండేపల్లి మండలం, మల్లెపల్లి గ్రామంలో ఇవాళ ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆటో ట్రాలీ తాడేపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.