అమరావతి : ఏపీలో దారుణం జరిగింది. పంటపొలాల వద్ద నిద్రిస్తున్న రైతుపై కుక్కలు దాడి చేయడంతో చికిత్సపొందుతూ రైతు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో(Annamaiya district) జరిగింది . జిల్లాలోని సంబేపల్లి మండలం ముదినేనివడ్డెపల్లిలో రెడ్డయ్య అనే రైతు(Farmer) ఎప్పటిలాగే పొలానికి కాపలాగ రాత్రి అక్కడే నిద్రపోయాడు. పొలం వద్దకు వచ్చిన కుక్కల(Dogs) సమూహం ఒక్కసారిగా రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆస్పత్రికి తరలించగా మంగళవారం చికిత్సపొందుతూ మృతి చెందాడు.