అమరావతి : నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహిస్తున్న ఉప ఎన్నికకు తొలిరోజు తొలి నామినేషన్ దాఖలు అయ్యింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన అభ్యర్తి గోదా రమేశ్ నామి నేషన్ వేశారు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 25న ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది.
అధికార వైసీపీ అభ్యర్థి తరుఫున మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ను బరిలో దించాలని ఆ పార్టీ నాయకులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేయగా టీడీపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జూన్ 6 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.