అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 11 గంటల వరకు 24.92శాతం వరకు పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో తన తల్లి మణిమంజరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పటిష్ట బందోబస్తు మధ్య ఆత్మకూరు ఉప ఎన్నిక కొనసాగుతుంది. మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మిక మృతితో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.
ఉప ఎన్నికలో వైసీపీ, బీజేపీ సహా మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,13,388 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం అధికారులు 279 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్తో పాటు.. 78 వెబ్క్యాస్టింగ్ చేస్తున్నారు. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరగనుంది.
,