అమరావతి : గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Vallabhaneni Vamsi ) పై ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు అతడిపై అరెస్టు వారెంట్(Arrest warrant) జారీ చేసింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ వివాదంలో వంశీపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి(Judge) అరెస్ట్ వారెంట్ జారీ చేశారు . నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేసి గెలుపొందారు.
ఎన్నికల సందర్భంగా ప్రసాదంపాడు( Prasadampad ) లోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన వివాదంలో వంశీతో పాటు మరో 38 మందిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణకు వంశీ హాజరుకాకపోవడంతో ఇప్పటికే వంశీకి న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్ జారీచేసింది . అయినా కూడా శుక్రవారం జరిపిన విచారణకు గైర్హాజరు కావడాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారు.