అమరావతి : ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండవలసిన ఓ పోలీసు అక్రమాలకు పాల్పడి కటకటాలపాలైన వైనం కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లా ఏపీ ఎస్పీ బెటాలియన్లో పనిచేసి సస్పెన్షన్లో ఉన్న హెడ్కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడితో పాటు మరొకరని అరెస్టు చేసిన పోలీసులు వారిద్దరీని రిమాండ్కు తరలించారు. వీరివద్ద నుంచి 200 కిలోల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.